పాకిస్తాన్కు మరో షాకివ్వనున్న భారత్.. సింధు జలాల నిలిపివేతకు మించి నిర్ణయం!
Thu Jun 12, 2025 14:55 Politics, World
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై తీవ్ర ఆంక్షలు విధించిన భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్కు షాకిచ్చేలా మరో చర్య చేపట్టింది. జమ్మూ కాశ్మీర్లో నిర్మించనున్న జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ప్రకటించారు. అయితే ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు. సింధూ జలాల ఒప్పందం విషయానికి వస్తే.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని వెల్లడించారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన టెక్నికల్ వివరాలు ఇప్పటికే ఖరారు చేసినట్లు తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యే కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటి కోసం తాము మరింత నీటి నిల్వ, విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు ప్రణాళికలు చేసే అవకాశాలు ఉన్నాయని మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వివరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఏప్రిల్ 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం.. సింధూ నదీ పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ ప్రాజెక్టులకు నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
తాజాగా కొత్త ప్రాజెక్టుల కోసం నిల్వ సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉండటంతో.. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాకిస్తాన్కు పంపించే నీటిని నిల్వ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నీటి కష్టాలు మరింత ఎక్కువై పాకిస్తాన్ ఎడారిలా మారనుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆమోదించిన 4 హైడ్రో ప్రాజెక్టులు నిర్మాణానికి రెడీగా ఉన్నాయి. వీటిలో సింధ్ నల్లాపై న్యూ గందర్బల్ (93 మెగావాట్లు), చీనాబ్పై కిర్తై-II (930 మెగావాట్లు), సావల్కోట్ (1,856 మెగావాట్లు), ఝులంపై ఉరి-I, స్టేజ్-II (240 మెగావాట్లు) ఉన్నాయి. ఏప్రిల్ నాటికి ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రారంభించాలని ప్రణాళికలు రూపొందించారు. చీనాబ్ నదికి ఉపనది అయిన మరుసుదార్ నదిపై బుర్సర్ నిల్వ ఆధారిత హైడ్రో ప్రాజెక్టు (800 మెగావాట్లు) ను కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సర్వే, పరిశోధన దశలో ఉంది. మరో రెండు ప్రాజెక్టులు.. దుల్హస్తి స్టేజ్-II (260 మెగావాట్లు), కిర్తై I (390 మెగావాట్లు) కూడా పరిశీలనలో ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 1,088 మెగావాట్ల సామర్థ్యంతో మరో 9 హైడ్రో ప్రాజెక్టులు నిర్మించేందుకు అవకాశం ఉంది. వీటిలో గంగ్బల్ (48 మెగావాట్లు), వార్డ్వాన్ బుర్సర్ (255 మెగావాట్లు) రెండు నీటి నిల్వ ఆధారితమైనవి కాగా.. మిగిలినవన్నీ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టులు అంటే నది ప్రవహిస్తుండగానే.. నీటి నుంచి విద్యుత్ను తయారు చేస్తారు. చీనాబ్ నదిపై 4 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు పాకల్డల్ (1000 మెగావాట్లు), రత్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), క్వార్ (540 మెగావాట్లు)ను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్న మొదటి నిల్వ ఆధారిత హైడ్రో ప్రాజెక్టు పాకల్డల్ ప్రాజెక్టు కావడం గమనార్హం. ఇది పూర్తి అయితే దాదాపు 109 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ ప్రకారం 2026 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ విద్యుత్ రంగంపై భారీ సంఖ్యలో సైబర్ దాడులు జరిగాయని.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. వాటిని ఇన్స్టాల్ చేసిన ఫైర్వాల్స్తో అడ్డుకున్నామని తెలిపారు. ఈ సైబర్ దాడుల్లో ఎలాంటి నష్టాలు లేవని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #india #pak #Attack #DronesMilitery #TurkeyHelped #First Stages #No Change #Government #More Storage
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.